Raashi Khanna: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే చాలా కష్టాలు పడాలి. నటనతోపాటు అందం, పర్ఫెక్ట్ బాడీ ఫిగర్ చాలా అవసరం. అప్పుడే సినిమాల్లో అవకాశాలు రాగలవు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు తమ క్రేజ్ను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ ఫాలొయింగ్ పెంచుకోవడానికి తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తున్నారు. తాజాగా సిమ్లా యాపిల్గా కనిపించే అందాల తార రాశి ఖన్నా కూడా తన వయ్యారాలను ఒలగబోస్తోంది. వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ పరంగా ఆఫర్లు తగ్గడం వల్లే.. ఇలా హాట్ హాట్గా దర్శనం ఇస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాశి ఖన్నా 2013లో విడుదలైన ‘మద్రాస్ కెఫె’ అనే హిందీ సినిమాతో తెర ముందుకు వచ్చింది. టాలీవుడ్లో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినా ఈ భామ యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ‘జోరు, జిల్, బైంగాల్ టైగర్, శివమ్, సుప్రీమ్, జైలవకుశ, రాజా ది గ్రేట్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజూ పండగే, వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్, థ్యాంక్యూ, తిరు వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ ఇప్పుడు ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పుకోవచ్చు.
మొదటి నుంచి రాశి ఖన్నా తన కెరీర్ విషయంలో పెద్దగా దూకుడు కనబర్చలేదు. తనవంతుగా గ్లామరస్ పాత్రల్లో నటించడం, యాక్టింగ్, డ్యాన్స్ చేసినప్పటికీ ఏ సినిమాల ద్వారా కూడా ఆశించిన ఫలితాన్ని మాత్రం పొందలేకపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆఫర్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘యోధ’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు వెబ్సిరీస్లోనూ ఈ భామ ప్రేక్షకులను అలరిస్తోంది.