Raghurama Krishnamraju: వివేకానంద రెడ్డి హత్యలో జగన్ భార్య భారతి ప్రమేయం.. రఘురామ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Raghurama Krishnamraju: నరసాపురం ఎంపీ టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలు విషయాలపై చర్చించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ ఈ కేసులో జగన్ భార్య భారతీయ ప్రమేయం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈ విషయం చెప్పడానికి తనకి ఎటువంటి సందేహము లేదని, ఈ కేసులో సిబిఐ విచారణ పూర్తయితే ప్రస్తుతం సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రధారిగా మారతారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

అలాగే జగన్ దంపతులను అర్జున్ సినిమాలోని ప్రకాష్ రాజ్,సరిత జోడితో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచు పోలుస్తూ ఉంటారని, ఆయన అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.

జగన్మోహన్ రెడ్డి తనపై మోపబడిన ఈ అభియోగాన్ని ఖండించాలి అనుకుంటే సిబిఐ ఎంక్వయిరీ పూర్తి చేయాలని కోరాలన్నారు.అలాగే జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరగటం ఏమో గాని అది ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. జగన్ కి వస్తున్న ప్రజల మద్దతు చూసి తట్టుకోలేక టీడీపీ ఆధ్వర్యంలోనే రాయి దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే ఇదంతా సానుభూతి కోసం జగన్ ఆయన పార్టీ సభ్యులు ఆడుతున్న డ్రామా అని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ విషయం మీద కూడా రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఒకే గులకరాయి ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి నుదుటికి, అటు బెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలింది అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. పైగా అంత చిన్న గాయానికి 16 మంది వైద్యులు 26 మంది నర్సులు వైద్యం చేయటం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి ఆ దెబ్బకి 16 మంది వైద్యులు 26 మంది నర్సులు అవసరమా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -