Akhil-Rajamouli: రాజమౌళి అఖిల్ కు మాటిచ్చారా.. సినిమా తెరకెక్కిస్తారా?

Akhil-Rajamouli: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు యంగ్ హీరో అఖిల్.బాల నటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన అఖిల్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇప్పటివరకు ఈయన తన సినీ కెరియర్లో ఐదు సినిమాలలో నటించక కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే పరవాలేదు అనిపించుకున్నప్పటికీ మిగిలిన సినిమాలన్నీ కూడా తనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

ఇక అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని తెలుస్తోంది.ఇలా అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఈయన కెరియర్ సందిగ్ధంలో పడిందని చెప్పాలి. అయితే ఈయన కెరియర్ టర్న్ తీసుకునేలా.. ఈయన ఇండస్ట్రీలో నిలబడటం కోసం రాజమౌళి రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.

 

ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక్కటి కూడా అపజయం కాలేదు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఎంతో అద్భుతమైన విజయాలను అందుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది.ఇలా ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి అఖిల్ ను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.

 

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయడం కోసం సినిమాఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల ఏర్పాట్లలో రాజమౌళి ఉన్నారు అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రాజమౌళి అఖిల్ తో సినిమా చేయబోతున్నారని వార్త వినపడుతోంది. అఖిల్ తో తప్పకుండా సినిమా చేస్తానని గతంలో రాజమౌళి నాగార్జునకు మాట ఇచ్చారట అందుకే ఇచ్చిన మాట ప్రకారం మహేష్ బాబుతో సినిమా అయిపోయిన వెంటనే అఖిల్ తో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్టేనని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -