Vijayendra Prasad: వైరల్ అవుతున్న విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

Vijayendra Prasad: రాజమౌళి సినిమాలకే కాకుండా బాలీవుడ్ సినిమాలకు సైతం కధలని అందిస్తూ గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్. తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పై చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. ఈమధ్య విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పై వైరల్ కామెంట్స్ చేశారు.

 

నేను ఏ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకోవడం లేదు. నేను కథ రాసుకుంటున్నప్పుడు రెండు పాత్రలు ఒకే లాగా అనిపించాయి కానీ సినిమా చూసిన తర్వాత కాస్త డిఫరెంట్ గా అనిపించింది. రామ్ చరణ్ పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం మాత్రమే ఉంది. ఎన్టీఆర్ గొప్ప నటుడు తనకు ఏ పాత్ర ఇచ్చిన సూపర్ గా నటిస్తాడు ఆర్ ఆర్ ఆర్ లో తను పోషించిన పాత్ర చాలా కష్టమైనది ఆ పాత్ర వల్లే కథ ముందుకు వెళుతుంది.

రామ్ చరణ్ క్యారెక్టర్ ని రాముడిగా చూపించాలని మేము అనుకోలేదు. రామరాజు లాగా చూపించాము కానీ అది రాముడిలాగా అనిపించింది రాముడి ప్రభావం కాస్త ఎఫెక్ట్ చూపించింది అంటూ ఆర్ ఆర్ ఆర్ పై వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలలో రాంచరణ్ కే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంది జూనియర్ ఎన్టీఆర్ కి ప్రాధాన్యత లేదు అని ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

 

ఈ చిత్రం విడుదలైనప్పుడు కూడా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడని అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ బిరుదు కోసం కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మరి ఈ వివాదం పై విజయేంద్రప్రసాద్ ఎలాంటి వివరణ ఇస్తాడో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -