Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ అగ్రస్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మగధీర సినిమాతో రాజమౌళి డైరెక్టర్ అనే పదాన్ని తిరగ రాసాడని చెప్పవచ్చు. అనంతరం ఈగ, బాహుబలి సిరీస్ తో ప్రస్తుతం రాజమౌళి ప్రపంచ స్థాయికి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
ఇక ఇటీవలే విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా రాజమౌళి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి రాజమౌళి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. రాజమౌళి సినిమాలో నటించడానికి ఏ స్టార్ హీరో అయినా బాగా ఆసక్తి చూపుతాడు. ఇక ప్రేక్షకులు కూడా రాజమౌళి సినిమా అనగానే.. ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురు చూస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి గురించి ఒక వార్త నెటిజన్ల నోట్లో నానుతుంది. అదేమిటంటే రాజమౌళి మొదటిగా ప్రభాస్ తో చత్రపతి సినిమా తీశాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో మరోసారి ప్రభాస్ ని పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేశాడు. మరి ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ హీరోగా మగధీర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి రామ్ చరణ్ ని పాన్ ఇండియాస్టార్ గా పరిచయం చేశాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ని కూడా త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మార్చేశాడు జక్కన్న. ఇందులో గమనించిన విషయం ఏమిటంటే.. రాజమౌళి రిపీటెడ్ హీరోలతోనే సినిమా తీస్తున్నాడు.
కానీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో ఇంతవరకు ఏ సినిమాను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కి రాజమౌళితో చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ.. రాజమౌళి ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అసలు జక్కన్నకి వీరిద్దరితో వచ్చిన సమస్య ఏమిటి.. అనే ప్రశ్న నెటిజన్ల నోట్లో నానుతుంది.