Rajamouli-Akhil: గత కొన్ని దశాబ్దాలుగా అక్కినేని వంశం టాలీవుడ్ లో తనదైన ముద్రని వేసుకొని ఒక వెలుగు వెలిగింది. అయితే నాగార్జున తోనే ఆ ప్రస్థానం ఆగిపోతుందేమో అని అక్కినేని అభిమానుల ఆందోళన. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే నాగచైతన్య కి స్టార్ అనిపించుకునే అంత హిట్ మూవీ ఒకటి కూడా పడలేదు. ఇక నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ విషయానికి వస్తే అతని కెరియర్ మరీ అధ్వానంగా ఉంది.
ఇంకా నాగచైతన్య పెద్ద స్టార్ గా కాకపోయినా నటుడిగా తన టాలెంట్ చూపించుకునే మూవీస్ ఒకటి రెండు చేశాడు. కానీ అఖిల్ విషయంలో ఆశ తీరటం లేదు నాగార్జునకి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ కూడా పెద్ద డిజాస్టర్ అవటంతో అఖిల్ రేసులో వెనకబడిపోయాడు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి రాబోయే సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీకి అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు.
ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీకి సుజిత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన అనిల్ కుమార్ చెప్పిన స్టోరీ అఖిల్ కి బాగా నచ్చిందట. ఈ సినిమా అఖిల్ ఒప్పుకోవటం, దానికి ధీర అనే పేరు పెట్టడం కూడా జరిగిపోయింది. అయితే ఈ మూవీ పై బాగా ఆశలు పెట్టుకున్న నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ మీద దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేయటానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా కార్తికేయ కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు అఖిల్ కోసం రాజమౌళి పనిచేస్తే మరి మహేష్ బాబుతో తీయబోయే సినిమా సంగతి ఏమిటి అని ఆందోళన పడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఒక సినిమాకి కమిట్ అయినప్పుడు ఆ సినిమా పని మాత్రమే చేయాలి మధ్యలో ఇవన్నీ ఏంటి అంటూ జక్కన్న పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి జక్కన్న దీనిపై ఎలా రెస్పాండ్ అవుతాడో.