Rakesh Master: రాకేశ్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయొద్దంటూ?

Rakesh Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆకస్మిక మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇప్పటికే ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజెన్స్ గతంలో రాకేష్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా రాకేష్ మాస్టర్ తాను చనిపోకముందే ఒక ఇంటర్వ్యూలో తాను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని వెల్లడించారు.

కాగా ఇంటర్వ్యూలో భాగంగా రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. నా మరణం తర్వాత శేఖర్‌, సత్య మాస్టర్ లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకపోయిన కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచి మాటలు చెబుతూ.. ఎప్పుడెప్పుడూ డెడ్‌ బాడీని తీసేస్తారా? అక్కడి నుంచి వెళ్లిపోదామా? అని ఉంటారని చెప్పుకొచ్చాడు రాకేష్ మాస్టర్. జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్‌ చేస్తాడని తెలిపాడు.

 

ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్‌ అవుతారని గతంలో తెలిపాడు రాకేష్ మాస్టర్. తన మరణం తర్వాత డెడ్‌బాడీని మెడికల్‌ కాలేజీకి చెందాలని, అందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపాడు. కాబట్టి తన శిష్యులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. తన అంత్యక్రియలకు వారెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదని, చివరికి తన కుమారుడు కూడా చితికి నిప్పు పెట్టాల్సిన పని లేదన్నాడు. తన అస్తికలు తీసుకొని గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదు అందుకే మరణానంతరం తన డెడ్‌బాడీని మెడికల్‌ కాలేజీకి చేరాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. దీంతో కొంతమంది మెడికల్‌ విద్యార‍్థులకు శవ పంచనామాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -