Ram Charan: వెండితెరపై వెలుగులీనే తారల జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవడం పైనా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. వారి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఇలా ప్రతిదీ తమకు తెలవాలనకుంటారు ఫ్యాన్స్. అలాగే తారల వారసుల పైనా వారికి ఎంతో గురి ఉంటుంది. స్టార్లలాగే వారి వారసులు కూడా సినీ వినీలాకాశంలోకి రావాలని.. తమ నటనతో ఎంటర్ టైన్ చేయాలని అనుకుంటారు.
పెళ్లయిన స్టార్లకు పిల్లలు పుడితే చాలు.. వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వాళ్లు పెద్దవాళ్లయి సినిమాల్లోకి వచ్చే దాకా అభిమానులు ఫాలో అవుతూనే ఉంటారు. వారి గురించి అప్ డేట్లను తెలుసుకుంటూనే ఉంటారు. ఇక, టాలీవుడ్ లవ్లీ కపుల్స్ లో రామ్ చరణ్ తేజ్–ఉపాసన ఒకరు. వీరికి వివాహమై చాన్నాళ్లవుతున్నా పిల్లల ఊసే లేదు.
ఎట్టకేలకు చరణ్–ఉపాసన నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. త్వరలో వీళ్లిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. చిరంజీవి తాత కాబోతున్నారు. ఇప్పటికే ఉపాసన బేబీ బంప్ తో ఉన్న పలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్ల ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.
అభిమానులు తట్టుకోగలరా..?
చరణ్ తనకు పుట్టబోయే పిల్లల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పిల్లలను సినిమాలకు వీలైనంత దూరంగా ఉంచాలని ఆయన డిసైడ్ అయ్యారని భోగట్టా. ఈ విషయంలో చెర్రీ.. జూనియర్ ఎన్టీఆర్ ను అనుసరిస్తున్నారని వినికిడి. చరణ్ పిల్లలు సినిమాలకు దూరంగా ఉంటే.. ఆయన ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమేనని చెప్పాలి. ఇకపోతే, చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.