Ramya Krishnan: వైరల్ అవుతున్న రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Ramya Krishnan: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రమ్యకృష్ణ నటన గురించి మనందరికీ తెలిసిందే. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రమ్యకృష్ణ. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన మెప్పించింది రమ్యకృష్ణ. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ.

ఇక ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ నటించిన వాటిలో శివగామిని పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎటువంటి సందేహం లేదు.
రమ్యకృష్ణ కేవలం తనంటే నీతోనే కాకుండా తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు కృష్ణ అప్పట్లో అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ.

ఇక ఈమె డైరెక్టర్ కృష్ణ వంశీ నీ పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇది ఇలా ఉంటే రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రమే తెలిపింది రమ్యకృష్ణ. రాఘవేంద్రరావు లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ ఉండే దానినో కూడా తెలియదు ఆమె తెలిపింది. తన జీవితాన్ని ప్రభావితం చేసిన రాఘవేంద్రరావుకు రుణపడి ఉండడంతో పాటు చివరి శ్వాస వరకు కృతజ్ఞురాలుగా ఉంటాను అని ఇప్పటికే పలుసార్లు ఆమె చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

 

రమ్యకృష్ణ మొదట 1984లో విడుదలైన కంచు కాగడ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఎన్ని సినిమాలు తీసిన అన్ని ఫ్లాప్ అవడంతో తనకు తానుగా ఆమె అన్ లక్కీ పర్సన్ అన్నట్టుగా ఫీల్ అయిందట. అంతే కాకుండా తనకు చెప్పకుండానే కొన్ని సినిమాల నుంచి ఆమెను తీసివేయడంతో అది తెలుసుకొని ఆమె లోలోపల కృంగిపోయిందట. కానీ అల్లుడుగారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా రాఘవేంద్రరావుకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -