చలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి గీతాగోవిందం సినిమాతో టాలీవుడ్ లో జెండా పాతేసిన నటి, నేషనల్ క్రష్ అయిన రష్మిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పుష్ప తో మంచి హిట్ ని అందుకున్న రష్మిక బాలీవుడ్లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం తెలుగు తో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో చేస్తుంది రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్ లోనూ భారీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ పుష్ప టు లో నటిస్తూ, రెయిన్బో అనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తుంది. అలాగే ధనుష్ నటిస్తున్న 15వ చిత్రంలో అతని సరసన హీరోయిన్ గా ఫైనల్ అయిందని సమాచారం. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంత బిజీ బిజీగా గడుపుతూ అప్పుడప్పుడు ట్రోల్స్ కి గురవుతూ, అప్పుడప్పుడు తన హాట్ పిక్స్ తో తన అభిమానులకి అత్యంత సన్నిహితంగా ఉంటుంది రష్మిక.
అయితే ఇప్పుడు తను చేసిన మరొక మంచి పని ఆమెని వార్తల్లో నిలిచేలాగా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ మధ్యనే రష్మిక మండన్న మేకప్ అసిస్టెంట్ సాయిబాబు పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచిన రష్మిక మందన్న వారిపై అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. అయితే సాయిబాబు దంపతులు రష్మిక కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకున్నప్పుడు మాత్రం ఆమె కాస్త తడబాటుకి గురైంది.
వెంటనే తేరుకొని వాళ్ళిద్దర్నీ ఆశీర్వదించడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కొందరు సినీ తారలు తమ స్టాక్ ని సొంత మనుషుల్లాగా చూసుకుంటూ వాళ్ళ సంతోషంలో సైతం పాలుపంచుకోవడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో రష్మిక సైతం చేరింది. ఆమె మంచి మనసుకి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.