TDP: నందమూరి ముద్ర పడకుండా కుట్ర జరుగుతోందా.. తెలంగాణలో వెనక్కు తగ్గడానికి కారణమిదా?

TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తాము పోటీ చేయబోయేది లేదని తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, స్వయంగా రాజమండ్రికి వెళ్లి, అక్కడి సెంట్రల్ జైలులోని చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యి తుది నిర్ణయాన్ని తెలుసుకొని తిరిగి భాగ్యనగరానికి చేరుకున్నారు. తమ పార్టీ పోటీ చేయబోవడం లేదని వెల్లడించారు. ఈ మాట పార్టీ సమావేశంలో ప్రకటించినప్పుడు. చాలామంది నాయకులు వ్యతిరేకించారని పోటీ చేసేలా చంద్రబాబును ఒప్పించాలని కోరారని, ఆ మేరకు తీర్మానం చేశారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే అదంతా జరిగే పని కాకపోవచ్చు. నిజానికి, తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే మొట్టమొదటిగా బాధపడేది కాసాని జ్ఞానేశ్వర్ మాత్రమే. తెలంగాణలో టీడీపీ పూర్తి స్థాయిలో శవాసనం వేసిన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ సారథిగా పగ్గాలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి అంతో ఇంతో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చంద్రబాబు తో ఖమ్మంలో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించారు. తన సొంత డబ్బును భారీగా ఖర్చు పెడుతున్నారని కూడా వినికిడి. అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి అయినా సరే తనతో పాటు తన కొడుకును కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఆయన కల అని పలువురు చెబుతుంటారు.

ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో మొదటగా ఇబ్బంది పడేది ఆయనే. ఈ ఎన్నికలలో అసలు పోటీ చేయకుండా ఊరుకుంటే కనుక.. వచ్చే ఎన్నికల నాటికి అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా సందేహమే. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనే విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -