Reliance Jio Turns 7: టెలికాం రంగంలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి వాటిలో జియో సంస్థలు ఒకటీ. ముఖేష్ అంబానీ ప్రారంభించిన ఈ టెలికాం సంస్థలు దేశవ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్లను ఆకట్టుకొని భారీ స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సంస్థను స్థాపించి ఏడు సంవత్సరాలు పూర్తి కావడంతో జియో కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించారు. మరి ఆ స్పెషల్ ఆఫర్స్ ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రస్తుతం జియో సంస్థలు అందిస్తున్నటువంటి ప్రీపెయిడ్ ప్లాన్స్ కి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జోడించి ఈ ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకురాబోతోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 తేదీ వరకు మాత్రమే ఉంటుంది. మరి కస్టమర్లకు జియో ప్రకటించినటువంటి ఆ స్పెషల్ ఆఫర్స్ ఏంటి అనే విషయానికి వస్తే…299 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మనకు 28 రోజులపాటు ఆ పరిమితమైనటువంటి వాయిస్ కాల్స్ 100 ఎస్ఎంఎస్ పాటు రోజుకు 2 జిబి డేటా లభిస్తుంది.
28 రోజులకు గాను అదనంగా 56 జిబి డేటా పొందవచ్చు. ఇక జియో ఏడవ వార్షికోత్సవ సందర్భంగా మనం అదనంగా 7 జి బి డేటాని ఉచితంగా పొందగలము. ఇకపోతే 90 రోజుల వ్యాలిడితో వచ్చే 749 రూపాయల రీఛార్జ్ కు రోజుకు 2gb డేటా అపరిమితమైనటువంటి వాయిస్ కాల్స్ 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. సెప్టెంబర్ 30 లోగా ఈ రీఛార్జ్ చేయించుకుంటే ఈ ఆఫర్లను మనం పొందవచ్చు.