Jio: ప్రస్తుతం రిలయన్స్ అధినేతలు జియో పేరిట ఇప్పటికే టెలికాం సమస్త పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మొబైల్ టెలికాం సంస్థలు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో కూడా ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి మంచి సక్సెస్ సాధించారు. అయితే తాజాగా జియో ఎంటర్టైన్మెంట్ రంగంపై కూడా దృష్టి సారించారని తెలుస్తోంది.
ఇప్పటికే జియో సమస్త అధినేతలు పలు టీవీ ఛానల్ ను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్టార్ మాతో ఇప్పటికే జియో అధినేత సంప్రదింపులు జరగాలని ఏ క్షణమైన స్టార్ మా జియో చేతులలోకి వెళ్లిపోవచ్చని తెలుస్తుంది. ఇలా జియో చేతికి స్టార్ మా అధికారాలన్నీ త్వరలోనే వెళ్ళబోతున్నాయని తెలుస్తోంది.
కేవలం బుల్లితెర చానల్స్ మాత్రమే కాకుండా థియేటర్లపై కూడా జియో దృష్టి సారించింది ఇప్పటికే పివిఆర్, ఏషియన్ జీవికే వంటి మల్టీప్లెక్స్ థియేటర్ల పై జియో దృష్టి పడటంతో సదరు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారని, వీలైనంతవరకు ఈ మల్టీప్లెక్స్ లను జియో అధినేతలు కొనడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా జియో అధినేతలు ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ రంగంపై దృష్టి సారించి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను థియేటర్లను తమ వశం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి.