Imandi Rama Rao: ఏపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెలిసిందే. తరచూ రోజా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తూ టార్గెట్ చేస్తూ ఉంటుంది. రాజకీయపరంగానే కాకుండా వ్యక్తిగతపరంగా కూడా ప్యాకేజీ స్టార్ మూడు పెళ్లిళ్లు అంటూ పదేపదే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒరేయ్, ఎవడ్రా నువ్వు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై ఒక సీనియర్ జర్నలిస్ట్ అందిస్తూ రోజాపై మండిపడ్డారు.
రోజా కి నడమంత్రపు సిరి నడుస్తోందని, ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఆమె విర్రవీగుతోంది అధికార పార్టీ దిగిపోయిన తర్వాత ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత అధికారం వెళ్ళిపోయాక అప్పుడు ఆమె చేతిని తప్పు ఆమెకు తెలిసి వస్తుంది. నెటిజెన్స్ అన్నట్టుగానే రోజాకి నిజంగానే పిచ్చి పట్టింది. పవన్ కళ్యాణ్ ని పట్టుకుని అరే పవన్ కళ్యాణ్ ఒరేయ్ పవన్ కళ్యాణ్ అని అనడం ఏంది ఆమెకు ఎంత ధైర్యం. ఆర్థిక పరిస్థితులు బాగో లేకపోయినప్పటికీ రోజా ఆ విధంగా మాట్లాడుతోంది. రోజాను ఆమె పార్టీ నేతలు కూడా ఒక పిచ్చిదానిలా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను పదేపదే విమర్శిస్తోంది కానీ ఆమె వెనకాల పట్టుమని పదిమంది లేరు. కానీ పవన్ కళ్యాణ్ వెనుక లక్షల మంది అభిమానులు నేతలు ఉన్నారు.
ఈ విషయాన్ని రోజా బాగా గుర్తుంచుకోవాలి అని తెలిపారు. రోజా చేసిన విమర్శలకు మండిపడిన పవన్ కళ్యాణ్ పూజ అని అనడంతో పాటు ఒక మహిళను అనరాని మాటలు అన్నారు ఆయన ఆ విధంగా అన్నారు అంటే మీరు ఆయనను ఏ రేంజ్ లో విమర్శించి ఉంటారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని తెలిపారు. నీ కూతుర్ని టార్గెట్ చేశారు నెగిటివ్ కామెంట్స్ చేశారని మీడియా ముందుకు వచ్చి ఏడ్చావు కదా అదే విధంగా పవన్ కళ్యాణ్ పిల్లలను ఆయన భార్య రేణు దేశాయ్ ను పదేపదే విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ అని ఆయన నిలదీశారు. నీ పిల్లలకు అయితే ఒక రూల్ వారి పిల్లలకు అయితే ఒక రూల్ నా అని ఆయన మండిపడ్డారు. నిజంగా రోజా బలిసి కొట్టుకుంటోంది పవన్ కళ్యాణ్ అనే హక్కు రోజాకి లేదు అనే సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.