Ramya Krishnan-Krishna Vamsi: వేర్వేరుగా ఉంటోన్న రమ్యకృష్ణ-కృష్ణవంశీ?

Ramya Krishnan-Krishna Vamsi: రమ్యకృష్ణ కృష్ణవంశీల జోడి ఎంత చక్కగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏనాడూ కూడా ఈ జోడి మీద ఎలాంటి రూమర్లు రాలేదు. ఎంతో అన్యోన్యంగా ఈ జంట ఉంటుంది. ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ వాళ్లది అన్నట్టుగా ఉంటుంది. ఇక రమ్యకృష్ణ అయితే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎక్కువగా నెట్టింట్లో షేర్ చేస్తుంది. తమ పిల్లాడి ఫోటోలు, భర్త ఫోటోలను రమ్యకృష్ణ షేర్ చేస్తుంటుంది.

కృష్ణ వంశీ డైరెక్టర్‌గా కాక ముందే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్. దర్శకుడిగా కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబి’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కృష్ణవంశీ మొదటిసారి రమ్యకృష్ణను డైరెక్ట్ చేసింది నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమా. ఈ చిత్రంలోనే రమ్యకృష్ణతో కృష్ణవంశీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే, స్నేహం, ప్రేమగా మారింది. చివరకు వివాహా బంధంతో ఒక్కటయ్యారు.

దాదాపు ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’ విడుదలకు రెడీగా ఉంది . ఈ సినిమా మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూలో కృష్ణ వంశీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌వంశీ మాట్లాడుతూ..‘ర‌మ్య‌కృష్ణ రేంజ్‌ని నేను మ్యాచ్ చేయాల‌నే టెన్ష‌న్ ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిష‌న్ ఉంది. నాకు ఖాళీ ఉంటే నేను చెన్నైకి వెళ్తా. ఆమెకు ఖాళీ ఉంటే ఇక్క‌డికి వ‌స్తుంది. నా కొడుకును బెబో అంటాం. మా అబ్బాయి రిత్విక్ చాలా షార్ప్, చాలా యాక్టివ్‌. క్రాస్ బ్రీడ్ క‌దా… తెలుగు, త‌మిళం, డైరక్ష‌న్‌, యాక్టింగ్ అన్నీ క్రాస్ బ్రీడ్‌.

ఇప్పుడు రిత్విక్‌కి టీనేజ్‌. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఒక వారం క్రికెట్ అంటాడు. ఇంకో వారం బిజినెస్ అంటాడు. ఇంకో వారం క్రిప్టో క‌ర‌న్సీ అంటాడు. అందులోనూ మ‌ద్రాసులో పెరిగాడు క‌దా. చెన్నైలో జ‌న‌మే కాస్త యాక్టివ్‌గా ఉంటారు. ర‌మ్య కొడుకు మీద 24 గంట‌లు ఓ క‌న్నేసి ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీలో పెరుగుతున్నాడు కొడుకు. ర‌మ్య అక్క‌డ‌, మీరిక్క‌డా ఉంటే చాలా పుకార్లు వ‌స్తుంటాయి క‌దా.. వాటికి మేమే రియాక్ట్ కావ‌డం లేదు. వాడేం రియాక్ట్ అవుతాడు. ఎవ‌రేం కంగారు ప‌డొద్దు, బాధ‌ప‌డొద్దు. నేనూ, ర‌మ్య క‌లిసే ఉన్నాం. ఇలాంటి గాసిప్స్ ఎంతో మంది మీద క‌నిపిస్తూనే ఉంటాయి’ అని కృష్ణ వంశీ రూమర్లకు సరైన సమాధానం ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -