Sai Pallavi: టాలీవుడ్లో లేడీ పవర్స్టార్గా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. హీరోలతో సమానంగా ప్రాధాన్యత ఉండే పాత్రల్లో మాత్రమే ఆమె నటిస్తోంది. నేచురల్ నటనకు కేరాఫ్ అడ్రస్ సాయి పల్లవి. వైవిద్యభరితమైన పాత్రలతో, డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. వెండితెరపై తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ సినిమా ప్రేమమ్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తక్కువ టైమ్లోనే సాయిపల్లవి స్టార్ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోల పక్కన నటించకపోయినా ఆమె అభిమానుల నీరాజనాలను అందుకుంది.
తాజాగా సాయిపల్లవిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఉంది. సాయిపల్లవి ఇప్పటివరకు రొమాంటిక్ సన్నివేశాలు, పాత్రలలో నటించలేదు. దీంతో తోటి హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రలు చేస్తున్నా.. సాయిపల్లవి చేయలేదంటే ఆమెలో ఏదో ప్రాబ్లమ్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. సాయిపల్లవిలో హార్మోన్లు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా మిగతా హీరోయిన్లు అందరూ రొమాంటిక్ సీన్లు చేస్తున్నారని.. సాయిపల్లవి దృష్టిలో వారంతా చెడిపోయినట్టేనా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సాయిపల్లవి మాత్రమే గ్లామర్ పాత్రలు పోషించడం లేదని.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే ఏదో కొంపలు మునిగిపోయినట్లు ఫీలవుతుందని.. దీంతో ఆమెలో కచ్చితంగా సమస్య ఉండే ఉంటుందని అంటున్నారు. సౌందర్య కూడా కొన్ని సినిమాల్లో గ్లామర్ షో చేసిందని కొందరు గుర్తుచేస్తున్నారు.
సాయిపల్లవి సినిమాలకు గుడ్బై చెప్పనుందా?
ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా ఆఫర్లు వస్తున్నా సాయిపల్లవి సున్నితంగా తిరస్కరిస్తుందని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. అందుకే ఆమె చేతిలో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించిన సాయిపల్లవి ఇండియా వచ్చిన తర్వాత నటిగా మారింది. అయితే ఇప్పుడు తాను చదివిన చదువుకు న్యాయం చేయాలని సాయిపల్లవి భావిస్తోంది. దీంతో సినిమాలకు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సంపాదించిన డబ్బులతో కోయంబత్తూర్లో సొంతంగా ఒక హాస్పిటల్ను నిర్మిస్తోందని సమాచారం.