Sai Dharam Tej: వాళ్లకు సాయితేజ్ ఎలాంటి సహాయం చేయలేదా.. ఏం జరిగిందంటే?

Sai Dharam Tej: టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు ప్రస్తుతం కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. కాగా సాయి తేజ్ యాక్సిడెంట్ ప్రమాదం నుంచి పూలుకున్న తర్వాత నటించిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.

ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ జరిగిన సమయంలో అబ్దుల్లా ఫరహాన్ అనే ఒక వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ని కాపాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో అబ్దుల్ ఫర్హాన్ ఉంది త్వరగా స్పందించడం వల్ల సాయి ధరంతేజ్ తొందరగా కోలుకున్నారు. అయితే ఆక్సిడెంట్ జరిగిన సమయంలో అబ్దుల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి తెలిసిందే. అయితే సాయి ని కాపాడినందుకు అతనికి డబ్బులు ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఆ విషయం పై స్పందించిన సాయి ధరమ్ తేజ్..

 

అతనికి డబ్బు ఇవ్వలేదని తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానని ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా కూడా వెంటనే సహాయం చేస్తాను అన్న హామీని ఇచ్చాను అని విరూపాక్ష ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ్. కానీ అబ్దుల్ ఫర్హాన్ మాత్రం సాయి తేజ్ చేసిన కామెంట్ లలో నిజం లేదని తాను అసలు సాయితేజ్ ను కలవలేదని చెబుతున్నారు. అప్పట్లో మెగా కుటుంబం లక్షల్లో తనకు సాయం చేసినట్టు వచ్చిన వార్తలు నన్ను ఇబ్బంది పెట్టాయని ఆ వార్తల వల్ల ఉద్యోగం మానేసి ప్రస్తుతం మరో ఉద్యోగం చేస్తున్నానని అబ్దుల్ ఫర్హాన్ వెల్లడించారు. సాయి తేజ్ కలవాలని కోరితే తాను కలుస్తానని అబ్దుల్ చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -