Sajjala Ramakrishna Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా తన కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈమె తన తండ్రిని చంపినది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని వారిద్దరిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వైసిపి ప్రభుత్వానికి ఓట్లు వేయొద్దని ప్రచారం చేశారు.
ఇలా సునీత రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టగా వెంటనే వైసిపి ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ఈయన తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా సునీత ముసుగు తీసినందుకు ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా మాట్లాడినటువంటి ఆమె తీరా ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ఆమె ముందుకు వస్తున్నారని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం కోసమే ఈమె ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారని సజ్జల వెల్లడించారు.
సునీత తన తండ్రిని చంపిన వారితో చేతులు కలిపారని ఆమె ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తుంది. అలా పోటీ చేయడం మంచిది ప్రజలే వివేక హత్య కేసులో తీర్పు ఇస్తారని సజ్జల తెలిపారు. సునీత వారం రోజులలోపు తన తండ్రిని చంపిన హంతకులను పట్టిస్తామని అప్పట్లో చెప్పారు. మరి తన తండ్రి చనిపోయిన రెండు నెలల వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఎందుకు కేసు విచారణకు పంపలేదని ప్రశ్నించారు. అయితే ఈయన వేసిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు ఉంటాయని వాటికి సమాధానం చెప్పే అవసరం సజ్జలకు ఉందని ఈయన చెప్పే మాటలను ప్రజలు ఎవరు నమ్మరు అంటూ టిడిపి నేతలు కూడా కామెంట్లు చేస్తున్నారు.