Samantha: మరోసారి తన గొప్ప మనసును అలా నిరూపించుకుంటున్న సమంత!

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార సమంత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలువురు స్టార్ట్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా పలు సినీ ఆఫర్లు అందుకుంది.

ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సమంత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు చేస్తూ నార్త్ ఇండియన్స్ ను కూడా ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా తో సమంత పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుకుంది. ఆ సినిమాలో తన హావ భావాలను ఒక హైటెమ్ సాంగ్ లో కనపరిచింది. దాంతో ఈ అమ్మడు అప్పటినుంచి పాన్ ఇండియా స్థాయిలో తెగ హడావిడి చేస్తుంది.

ఇక వరల్డ్ వైడ్ గా కూడా కొన్ని సినిమా ఆఫర్లు సమంత సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే సమంత కొన్ని రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. అంతేకాకుండా సమంత ఒక వేద పాఠశాలలో పూజలు చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ వైరల్ గా మారాయి. ఇక ఈ క్రమంలో సమంత నిరుపేదలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల సమంత తనకు మంచి జరగడం కోసం సికింద్రాబాద్ లోని ఒక వేద భవన్ లో హోమం చేసినట్లుగా ఫోటోలు బయటపడ్డాయి. ఇక సమంత గురుకుల ఆశ్రమానికి భారీ స్థాయిలో విరాళాలు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరొక ఆశ్రమానికి ఆవులను కూడా విరాళంగా ఇవ్వాలని సమంత అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సమంతా క్రిస్టియన్ గా పుట్టింది.. కానీ హిందూ దేవాలయం పూజించడంలో కూడా సమంత చాలా ఇంట్రెస్ట్ చూపుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -