Samantha: సమంత లైఫ్ లో ఫస్ట్ క్రష్ అతనే.. ఇంతకు ఎవరంటే?

Samantha: సమంత తెలుగు చలనచిత్ర నటిగా అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు, తమిళ భాషలలో నటించడం జరిగింది. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. 2010లో ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది.

తెలుగు ప్రముఖ హీరోయిన్లలో తాను ఒకటిగా చేరిపోయింది. ఇక గతంలో తన వ్యక్తిగత కారణాలవల్ల కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఇక తాను నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4న థియేటర్లలో విడుదల అవుతుండగా ఈ సినిమాకు దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ దర్శకత్వం వహించడం ద్వారా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఇక సమంత గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ గా మారాయి. తనకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమట. కానీ జెస్సీ పాత్రలగా మౌనంగా తాను ఉండనని పేర్కొనడం జరిగింది. తాను జెస్సీ అంతా సీరియస్ గా కూడా ఉండనని తెలపడం జరిగింది. ఇంకా ఆ ఇంటర్వ్యూలో తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తన సీనియర్ తనకు ఫస్ట్ క్రష్ అని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇంకా తనకు హైదరాబాద్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమట. సినిమాలలోకి వచ్చాక పర్సనల్ గా తాను ఏమి మారలేదు అని తెలిపింది. ప్రతి అమ్మాయి తన జీవితంలో కాస్తయినా కన్ఫ్యూజన్ ను ఖచ్చితంగా ఫేస్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఏ మాయ చేసావే సినిమా కథ వినకుండానే ఆ సినిమాకు ఓకే చేసినట్లు పేర్కొంది.

ఏ మాయ చేసావే సినిమాలో మొదటి సన్నివేశంలో నటించే సమయంలో తనకు డైలాగ్స్ లేకపోయినా కాస్త చేతులు వణికాయని తెలుపుతూ తాను అసలు రొమాంటిక్ కాదని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మధ్య సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -