Actress Samantha: తప్పుడు న్యూస్‌పై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటానన్న సమంత

Actress Samantha: అమాయకంగా మాట్లాడి అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న హీరోయిన్‌ సమంత. తెలుగు, తమిళ చిత్రాల్లో పెద్ద పెద్ద హీరోలతో నటించిన సమంత ఎన్నో హిట్స్‌ కొట్టింది. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో చిన్న చిన్న సినిమాలతో ప్రారంభించి అగ్ర కథనాయకుల సరసన నటించి అందరి మన్ననలు పొందింది. యూ టర్న్, ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి సూపర్‌ హిట్స్‌ను అందుకుంది. అయితే కెరీర్‌ ప్రారంభమై పీక్స్‌లో ఉన్న రోజుల్లో సమంత కొన్నాళ్లు చర్మ సమస్యతో బాధపడినట్లు అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి.

చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు అలాంటి దానికి సమంత రహాస్యంగా చికిత్స తీసుకుందని దీంతో సమంత ఇప్పుడు ఆ సమస్యతో బయట పడిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సమంతను ఎవరూ ప్రశ్నించలేదు, ఆమె కూడా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు. అయితే ప్రస్తుతం అలాంటి వార్తే మళ్లీ నెట్టింట్లో తిరుగుతోంది. సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని.. ఆ కారణంతో బయటకు రాలేకపోతోందని వార్తాలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలకు సమంత పర్సనల్‌ మేనేజర్‌ స్పందించాడు. ‘‘కొందరు కావాలనే సమంతపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. హీరోయిన్‌ సమంతకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని.. ఆమె ఆరోగ్యంగానే ఉందన్నాడు. ఈ నెలలోనే షూటింగ్స్‌లో వెళ్లనున్నట్లు పేర్కొన్నాడు. సమంతపై ఇష్టానుసారంగా తప్పుడు వార్తలను సృష్టిస్తున్న వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకోవాలని సమంత ఆలోచిస్తుంది’’ సమయంత మేనేజర్‌ పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -