Samantha: ఇకపై సమంత గురించి రాస్తే కోర్టు చుట్టూ తిరగాల్సిందే!

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా స్థాయిలో హడావిడి చేస్తుంది. బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లు చేస్తూ.. అటు హాలీవుడ్ లో కూడా కొన్ని సినీ అవకాశాలు అందుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకువెళుతుంది.

ఇక సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత.. సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల పుకార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ సమంత ఇటువంటి పుకార్లను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక తన లైఫ్ గురించి ఆలోచిస్తూ కెరియర్ పరంగా ముందుకు వెళ్ళింది. ఇదిలా ఉంటే ఇటీవల ఒక వెబ్ సైట్ లో ఒక స్టార్ హీరోయిన్ కి స్కిన్ డిసీజ్ వచ్చిందని.. దాని కారణంగా తను ఎవరిని కలవలేకపోతుందని రాసుకొచ్చారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఆమె చేసే షూటింగ్ లు కూడా చాలా వరకు ఆపేసిందని లేనిపోని చెత్తంతా రాశారు. ఆ వార్త చూసిన సమంత మేనేజర్ మాట్లాడుతూ సమంత కు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని తెలిపాడు. అలాగే స్కిన్ డిసీజెస్ కూడా లేవు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా ఈ నెలలో ఆమె ఒప్పుకున్న సినిమాలు కూడా షూటింగ్ నేపథ్యంలో హాజరవుతున్నట్లు తెలిపాడు.

అయినప్పటికీ సమంత గురించి నెగిటివ్ రూమర్ స్ప్రెడ్ చేస్తే.. లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా ఇకపై సమంత గురించి ఏదైనా న్యూస్ రాయాలంటే.. కోర్టు నోటీసులు అందుకొని, కోటి చుట్టు తిరగాల్సి వస్తుందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సమంత ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. మొత్తానికి సమంత టాలీవుడ్ లో ఎన్నో పుకార్లను చవి చూసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -