Samantha: నా చర్మం చూస్తే దడుచుకుంటారు.. అందుకే అవి వాడతాను.. సమంత సంచలన వ్యాఖ్యలు!

Samantha: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది సమంత ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. కాగా సమంత ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం వేకెషన్ లో ఉన్న సమంత ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. కాగా సామ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది సమంత.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల తర్వాత తాజాగా మరొకసారి అభిమానులతో ముచ్చటించింది సమంత. అందులో అభిమానుల ప్రశ్నలకు వీడియోలో సమాధానం చెప్పింది. ఇక మొదటగా తన అభిమానులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంది. ఇక ఆ తరువాత తన నెక్స్ట్ ట్రిప్ ఆస్ట్రియా అని చెప్పుకొచ్చింది. ఇంతలోనే ఒక అభిమాని తన తదుపరి చిత్రం ఎప్పుడు మొదలవుతుంది అని అడగ్గా.. ఇప్పుడప్పుడే కాదు అని, ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక మరో అభిమాని స్కిన్ అంత క్లియర్ గా ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్నకు..

తన స్కిన్ ఇప్పుడు బాగోలేదని అది ఫిల్టర్ అని స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకోవడం వలన తన స్కిన్ అంతా పాడైపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక చివర్లో ఇప్పటి జనరేషన్ టీనేజర్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి మీకు ఇచ్చే సలహా ఏంటి అన్న ప్రశ్నకు.. నేను యంగ్ స్టార్స్ ను, టీనేజర్స్ ను చూసినప్పుడు.. వారు దగ్గర నేను ఎప్పుడు వినే మాట నా జీవితం అయిపోయింది. ఇలాంటి వరస్ట్ పరిస్థితి నా జీవితంలోనే జరిగిందని చెబుతుంటారు. కానీ కేవలం మీ జీవితంలోనే ఇలాంటి వరస్ట్ పరిస్థితి లేదు. ఇప్పుడే మీ జీవితం మొదలయ్యింది. మీ జీవితంలో వచ్చే ఎన్నో ఇబ్బందులను మీరు ఎదుర్కోవవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీలో ఉన్న ధైర్యం మీకు తెలియకపోవచ్చు మీరు ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లోనే తెలుస్తోంది. నా 25 ఏళ్ళ వయస్సులో నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పుకొచ్చింది సమంత.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -