Samantha: మరోసారి అలాంటి ట్వీట్ చేసిన సమంత?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న తెలిసిందే. ఒకవైపు టాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కాగా సమంత తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

తరచూ నెటిజెన్స్ ఈమెను ఏదో ఒక విషయంలో ట్రోలింగ్స్ చేయడం నెగిటివ్ గా కామెంట్ చేయడం లాంటివి చేస్తూనే ఉంటారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతున్న వారిలో సమంతనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత దారుణమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు తప్పంతా సమంతాదే అన్నట్టుగా ప్రతి విషయంలో ఆమెను ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని విషయాలపై సమంత తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ వచ్చింది.

 

అయినప్పటికీ ఒక కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం ఆమెపై అలాగే దారుణమైన ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ట్రోల్స్, నెగిటివ్ పై విసుగు చెందిన సమంత అటువంటి వాటిని పట్టించుకోవడమే మానేసింది. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో సమంత సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఆసక్తికరంగా మారాయి. బావోద్వేగంతో కూడుకున్న పోస్టులను ఎక్కువగా చేస్తోంది సమంత. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ ని చేసింది. చావు నుండి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవడమే అని రాసుకొచ్చింది సామ్. చిలీ దేశానికి ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన కోట్ ని సమంత షేర్ చేశారు. ఈ కోట్ ఆమె షేర్ చేయడం వెనుక ఆంతర్యం తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -