Sameera Reddy: తెలుగు సినీ నటి సమీరా రెడ్డి గురించి అందరికీ పరిచయమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో జై చిరంజీవ సినిమాతో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది.
ఇక పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకే దూరమైంది. తొలిసారిగా 2002లో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక 2005లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, హిందీ తో పాటు బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది.
తెలుగు ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు అందుకోలేకున్నా కూడా ఇతర భాషలలోనూ అవకాశాలు అందుకొని మంచి పేరు సంపాదించుకుంది. ఇక 2014 లో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ్ వార్దేని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీ ఫోటోలను తన ఫాలోవర్స్ తో బాగా షేర్ చేసుకుంటుంది. ఇక ఆమె మూడోసారి తల్లి కాబోతున్నట్లు కనిపిస్తుంది. దీంతో తాజాగా తన ఇన్ స్టాలో తన బేబీ బంప్ తో తీయించుకున్న ఫోటో షూట్లను పంచుకుంది. ఏకంగా తను స్విమ్మింగ్ ఫూల్ లో ఫోటోషూట్ లు తీయించుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు స్విమ్మింగ్ పూల్ లో ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.
1
2
3
4
5
6