Shaakuntalam: ప్రశ్నించడం తప్పా.. గుణశేఖర్ కు వాళ్లు చుక్కలు చూపించారుగా?

Shaakuntalam: ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు డైరెక్టర్ గుణశేఖర్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారు.గుణశేఖర్ సినిమా ఫ్లాప్ అయితే టిడిపి శ్రేణులు ఆయనని ట్రోల్ చేయడం ఏంటి అనే విషయానికి వస్తే…

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క నటించిన రుద్రమదేవి సినిమా విడుదలయి మంచి సక్సెస్ అందుకుంది. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికార ప్రభుత్వం గురించి గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుద్రమదేవి సినిమాకు అవార్డు ఇవ్వలేదంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ సమయంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చారని, తన రుద్రమదేవి సినిమాకు మినహాయింపు ఇవ్వలేదని ఈయన ప్రశ్నించారు.

అందరూ మర్చిపోయిన తెలుగుజాతి చరిత్రను వీడెవడో వెలికి తీసి గుర్తు చేశాడు మరోసారి అవార్డు ఇచ్చి ఎందుకు గుర్తుచేయడం? అని అవార్డు ఇవ్వలేదా అంటూ ఈయన గతంలో ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. అయితే ఇప్పుడు టిడిపి శ్రేణులు లేఖను వెతికి తీసి పెద్ద ఎత్తున గుణశేఖర్ ను ట్రోల్ చేస్తున్నారు. శాకుంతల లాంటి సినిమా చేసే బదులు సినిమా తీయడమే మానుకో అంటూ భారీగా ఈయనపై విమర్శలు చేస్తున్నారు.

అప్పట్లో రుద్రమదేవి సినిమాకు అవార్డు ఇవ్వలేదని డిమాండ్ చేసిన గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం సినిమాకు అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేయాలి అంటూ వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వయసు మీద పడి ఘాటు లేఖలు రాయలేకపోతే మేము రాసిస్తామని, తెలుగుదేశం అభిమానులు బహిరంగంగా సోషల్ మీడియాలో గుణశేఖర్ కు సూటి ప్రశ్నలు వేస్తున్నారు. ఇక మరికొందరైతే ఈ సినిమాను ఆస్కార్ అవార్డుకు పంపించాలంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని ఆస్కార్ కి పంపించి ఆస్కార్ అవార్డు రాకపోతే ఇంగ్లీష్ పేపర్లకు ప్రశ్నించడం తప్ప అంటూ ఒక బహిరంగ లేఖ రాయమని సూచనలు చేస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గుణశేఖర్ రాసినటువంటి ఈ లెటర్ ఇలా ఇప్పుడు బయటకు వస్తుందని గుణశేఖర్ బహుశా ఊహించి ఉండడేమో. ఏదిఏమైనా శాకుంతలం సినిమా కారణంగా గుణశేఖర్ భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -