Viral: వైరల్ అవుతున్న ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!

Viral: సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ కొందరి లైఫ్ చాలా బాగుంటుంది. వారి కెరీర్ ముగిసినప్పటికీ కూడా ఆర్థికంగా వాళ్ళు బాగా బలంగా ఉంటారు. ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు బాగా సంపాదించుకున్నారు. ఎన్నో చోట్ల భూములు, బంగ్లాలు కొనిపెట్టి ఇప్పుడు కూర్చొని తింటున్నారు. తాజాగా ఒకప్పటి నటి కూడా తన ఇంట్లో బీరువా నిండా బంగారం ఉంటుంది అని కొన్ని కామెంట్స్ చేసింది. ఇంతకు ఆ నటి ఎవరో కాదు జయమాలిని.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో సందడి చేసిన నటి జయమాలిని. అప్పట్లో ఈమె అందానికి ఎంతో మంది పడిపోయారు. ఇప్పటికీ కూడా ఈమె అంతే అందంగా ఉందంటే మామూలు విషయం కాదని చెప్పాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె నటిగా, శృంగార నృత్య తారగా నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో కూడా నటించింది.

 

ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈమె సోదరి జ్యోతిలక్ష్మి కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన నటి అని అందరికీ తెలుసు. ఇక జయమాలిని తొలిసారిగా హీరోయిన్ గా నటించగా ఆ తర్వాత డాన్సర్ గా నటించింది. ఆమెకు నటిగా కంటే డాన్సర్ గానే మంచి పేరు అందింది. తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 

అలా ఆమె అన్ని భాషలలో కలిపి దాదాపు 600 పైగా సినిమాలలో నటించింది. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలోనే నటించింది. ఇక ఈమె చిన్ననాటి మిత్రుడైన పార్తిబన్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చెన్నైలోనే సెటిల్ అయ్యింది. ఈమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తన ఫ్యామిలీని దగ్గరుండి చూసుకుంటుంది.

 

అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమంలో పాల్గొని తన గురించి చాలా విషయాలు బయటపెడుతూ ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోని పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది. ఏ హీరోయిన్ సంపాదించినంత ఆస్తిని ఆమె సంపాదించుకుందని అర్థమవుతుంది. ఆమె సంపాదించింది అంతా జాగ్రత్తగా పెట్టకుండా.. బాగా తినడం, చీరలు, కొనడం వంటివి చేసిందట.

 

వాళ్ళ అమ్మ కూడా వెరైటీ వెరైటీ నగలు, బాగా చీరలు కొంటుందని తెలిపింది. మూడు బీరువాల్లో మాత్రం చీరలో ఉంటాయని షాకింగ్ కామెంట్ చేసింది. ఇక ఒక బీరువా మొత్తం బంగారం ఉందని తెలిపింది. ఇక తన ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -