Hyderabad: అందుకే భార్యకు చేతబడి చేయించేందుకు సిద్ధమయ్యాడు!

Hyderabad: ప్రస్తుత కాలంలో చంద్రుడి వద్దకు వెళ్లేంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇంకా చాలా మంది మూఢనమ్మకాలు, మంత్రాల పేర్లతో వారితో పాటు కుటుంబ సభ్యులు, ఇతరులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. పూర్వం గ్రామీణ, ప్రాంతాల్లో కుగ్రామాల్లో మంత్ర తంత్రాలు చాలా జరిగేవి. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను చంపేందుకు చేతబడి చేయించేందుకు యత్నించిన ఘటన ఎక్కడో పల్లెనో.. కుగ్రామంలో జరిగిందంటే పొరపాటే. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరబాద్‌ నడి బొట్టున జరిగింది. ఇటీవల జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అందుకు సంబం«ధించిన వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ ప్రాంతంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో సదరు వ్యక్తి మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన భార్య పలుమార్లు అతడితో వాదించింది. దీంతో తను రెండవ పెళ్లి చేసుకునేందు భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అడ్డు తొలగించుకోవాలన్నాడు ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలో అని నెల రోజులుగా ఆలోచనలు చేస్తూ వచ్చాడు. తన భార్యను ఎలాగైనా హత్య చేయాలని నీచమైన నిర్ణయానికి పూనుకున్నాడు. నేనే నేరుగా చంపితే పోలీసులు జైలుకు పంపిస్తారని భయపడి మరో కృరమైన పనికి సిద్ధమయ్యాడు. అయితే తన భార్యను చేతబడి చేసి చంపాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే భార్య జ్వరంతో బాధపడుతోంది.

దీనినే ఆసరాగా చేసుకున్న అతడు ఓ భూత వైద్యుడిని ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం చేతబడి భాగంగా ఓ తెల్ల కోడితో రక్తం చిందించాడు. దీంతో పాటు పసుపు కుంకుమ, నిమ్మకాయలతో మంత్ర తంత్రాలు చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఆ తతంగాన్ని పోలీసులు అడ్డుకుని ఆ మహిళ భర్తతో పాటు ఆ భూత వైద్యుడిని జైలుకు తరలించారు. చేతబడి చేస్తున్నారని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -