Hyderabad: ఉద్యోగంలో ఉండాలంటే ముద్దివ్వాల్సిందే.. హైదరాబాద్ లో ఉద్యోగుల పరిస్థితి ఇంత ఘోరమా?

Hyderabad: ప్రస్తుత రోజుల్లో సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహిళలకు ఎక్కడికి వెళ్లినా కూడా ఇబ్బంది అవమానకర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రదేశంలో మహిళలకు మానసిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక ఆఫీసులలో పనిచేసే ఉద్యోగాల పరిస్థితి అయితే వర్ణనాతీతం అని చెప్పవచ్చు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫిట్‌నెస్‌ శిక్షకురాలిగా ఉద్యోగంలోకి తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న మర్దన కేంద్ర నిర్వాహకులపై పంజాగుట్ట ఠాణాలో శనివారం కేసు నమోదైంది.

బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఒక మహిళ పంజాగుట్టలోని ఒక మర్దన కేంద్రంలో ఫిట్‌నెస్‌ శిక్షకురాలిగా చేరారు. అయితే అక్కడికి వచ్చే వారికి మర్దన, శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయించటమే ఉద్యోగ బాధ్యతగా చెప్పారు. దీనికి ప్రతిఫలంగా నెలకు రూ.లక్ష వేతనం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. 20 రోజుల తర్వాత నుంచి అక్కడకు వచ్చే పురుషులకు అనుకూలంగా నడుచుకోవాలంటూ ఒత్తిడి చేయటం ప్రారంభించారు.

ముద్దులివ్వాలని, వారు చెప్పినట్లు చేయాలని నిర్వాహకుల బెదిరింపులు అధికమవటంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -