Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. యశోద సినిమా షూటింగ్ సందర్బంగా ఆమె మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ తర్వాత యశోద సినిమా విడుదలై విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఆమె నెట్టింట అంతగా కనిపించలేదు. కానీ ఆమెకు సంబంధించిన వార్తలు మాత్రం షికారు చేస్తూనే ఉన్నాయి.
సమంత సోషల్ మీడియాకు దూరం అవ్వడంతో ఆమెపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ఆమె ముంబయి ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట పడ్డారు. అయితే సమంతను చూసిన వారు షాక్ అవుతున్నారు.
నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ గా కాంటే యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లోనూ రాజీ అనే ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ వెబ్ సిరీస్ లో ఫైట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వస్తోంది.
తాజాగా ‘శాకుంతలం’ సినిమా కోసం ఆమె డబ్బింగ్ చెబుతున్నట్లు ఇన్ స్టాలో తెలిపింది. తాజాగా శుక్రవారం ఉదయం ముంబయి ఎయిర్ పోర్ట్ లో వైట్ డ్రస్ లో ఆమె అందరికీ దర్శనమిచ్చింది. అయితే సీరియస్ గా నడుచుకుంటూ వెళ్లిపోవడంతో సమంతను అలా చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా సమంత మయాసైటిస్ వ్యాధి థర్డ్ స్టేజీలో ఉన్నట్లు గతంలోనే చెప్పింది. అందుకే సమంత బయట ఎక్కువగా కనిపించకుండా వైద్య చికిత్స తీసుకుంటోంది. ఇకపోతే ‘ఖుషి’ సినిమాలో సమంత సీన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులను కూడా సమంత ఒప్పుకోకుండా ఉంది. అలానే సమంత, ముంబయి ఎందుకు వెళ్లిందనేది వార్తలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి సమంత చాలా మారిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.