SSMB 28: మహేష్ త్రివిక్రమ్ మూవీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఏమైందంటే?

SSMB 28: టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏ ముహూర్తం మొదలుపెట్టారు కానీ అప్పటి నుంచి ఏదో ఒక విషయంతో ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పటికి చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ మరొకసారి వాయిదా పడినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకమైన సమస్యలు వస్తూనే ఉన్నాయట.

అందులో భాగంగానే మొదట మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్ విషయంలో సమస్య మొదలు కాగా విషయాన్ని త్రివిక్రమ్ ఏదో ఒక విధంగా పరిష్కరించి సర్దుబాటు చేసి ముందుకు తీసుకెళ్లారు. ఆ తరువాత షూట్ స్టార్ట్ చేసారు. ఆ తర్వాత మళ్లీ కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసుకువచ్చి షూట్ చేసారు. కానీ హీరోకి వాళ్ల పని నచ్చలేదు. దాంతో షూట్ చేసినదంతా పక్కన పడేసి. ఫైట్ మాస్టర్లను మార్చడంతో దానికోసం దాదాపు వరకు ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టగా అది కాస్త లాస్ అని తెలుస్తోంది. హీరో మహేష్ బాబు మొన్నటి వరకు వెకేషన్ కు వెళ్లి రాగా వచ్చి రాగానే మహేష్ బాబుకు త్రివిక్రమ్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

 

ఇటీవల ఒక మాల్ లో చేసిన హీరో, హీరోయిన్ శ్రీలీల కాంబో సీన్లు మొత్తం స్క్రాప్ చేస్తున్నట్లు త్రివిక్రమ్ చెప్పారన్నది వినిపిస్తున్న గ్యాసిప్. తనకు సంతృప్తిగా రాలేదని త్రివిక్రమ్ చెప్పడంతో హీరో కాస్త చికాకు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం మాల్ లో చేసిన షూట్ ఫుటేజ్ నే స్క్రాప్ చేస్తున్నారా? లేక మొత్తం ఇప్పటి వరకు చేసినది అంతా తీసేస్తారా? అన్నది క్లారిటీ లేదు. త్రివిక్రమ్ వేరే పనుల మీద దృష్టి పెట్టి, మహేష్ సినిమా మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదనే విమర్శ ఒకటి వుంది. మహేష్ బాబు ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా వుండడంతో, మహేష్ వీలయినంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇలా బ్రేక్ లు పడుతున్నాయి.

 

పైగా మహేష్ ఏదో ఊళ్లు తిరుగుతున్నారు. ఎండలకు భయపడుతున్నారు అంటూ బయటకు ఫీలర్లు వస్తుంటే మరింత ఫీలవుతున్నారు. మొత్తానికి మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఏదో జరుగుతోంది అన్న విషయం బాగా అర్థమవుతుంది. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేస్తారో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -