Pawan Kalyan: పవన్ పై వైసీపీ నేతల షాకింగ్ సెటైర్లు.. ఏమైందంటే?

Pawan Kalyan: జనాల్లోకి రావడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చుపెట్టి వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఆత్యాధునిక ఫీచర్లతో తయారైన ఈ వాహనంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనంలోకి వస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వారాహిపై జనంలోకి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటూ జనసేన నాయకులు కార్యకర్తలు రోజుకు ఒక డేటు ప్రకటిస్తున్నారు.

జనాలకి వారాహి వాహనాన్ని సినిమాటిక్ గా పరిచయం చేసి కొండగట్టులో దానికి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారు పవన్ కళ్యాణ్. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ వాహనం ఎందుకో ప్రజల్లోకి రావడానికి మాత్రం ముహూర్తం కుదరటం లేదు. ఆయన గాని జనంలోకి వస్తే ఆ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మీద పడుతుందని అందుకే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని రాజకీయ వర్గాల సమాచారం.

 

అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అదే డైలాగ్ చెప్పడం ఇప్పుడు ట్రెండ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులు మాత్రం పవన్ కళ్యాణ్ తగ్గేదే అంటూ ఆయన పై సెటైర్లు విసురుతున్నారు. ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది.

 

ఫుల్ టైం రాజకీయానికి కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలకు గాని వారాహిపై రావడానికి గాని అయిష్టత చూపిస్తున్న పవన్ కళ్యాణ్ మరి దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అడిగితే చంద్రబాబుని వెనకేసుకు రావడానికి మాత్రం ఊ కొడుతున్నారని. పుష్ప సినిమాలో సమంత పాటతో పోల్చుతూ పవన్ కళ్యాణ్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు ప్రత్యర్థులు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయటంపై కూడా పవన్ కళ్యాణ్ తగ్గుతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -