Jagityal: ప్రేమకు మరొకరు బలి.. కూతుర్ని ప్రేమించినందుకు అలా?

Jagityal: జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్ లో వంశీ అనే 23 ఏళ్ళ యువకుడు నివసిస్తున్నాడు. వంశీ స్థానికంగా ఉండే ఒక డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తుండేవాడు. కాగా వంశీకి గతంలో స్థానికంగా ఉండే ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అయితే ఎట్టకేలకు వారి ప్రేమ వ్యవహారం గతంలో యువతి ఇంట్లో తెలిసింది. ఆ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మరో యువకుడితో వివాహం జరిపించారు.

కానీ వంశీ మాత్రం ఆ యువతిని మరిచిపోలేకపోయాడు. తరుచు ఆమెతో ఫోన్ లో మాట్లాడేవాడని సమాచారం. ఆ విషయం మరోసారి యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.

వెంటనే పద్దతి మార్చుకోవాలంటూ వంశీని హెచ్చరించారు. అయినా సరే అతడు యువతిపై మాట్లాడేవాడట. ఇక తట్టుకోలేకపోయిన ఆ వివాహిత కుటుంబ సభ్యులు వంశీని చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వంశీ కొల్వాయి నుంచి తుంగూరుకు బైక్ వస్తున్నాడిని తెలుసుకున్నారు.

 

దారి మధ్యలో అతడిని అడ్డగించి అందరూ చూస్తుండగానే ఆ దుర్మార్గులు వంశీని దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఆ తర్వాత వంశీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -