SangaReddy: చిన్న కారణంతో అత్తమామలను చంపడానికి అల్లుడు స్కెచ్?

SangaReddy: జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని అతలాకుతలం చేయడంతో పాటు కుటుంబాలను వీధిన పడేస్తూ ఉంటాయి. రెప్పపాటి కాలంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలనే మార్చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం చంపడం లాంటివి చేస్తున్నారు.. తాజాగా కూడా ఒక వ్యక్తి ఒక చిన్న కారణంగా ఏకంగా అత్తమామలను చంపడానికి భారీ స్కెచ్ వేశాడు. అసలేం జరిగింది? అత్తమ్మ మామలను ఎందుకు చంపాలనుకున్నాడు?

ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి గతంలో వివాహం అయ్యింది. అయితే ఇటీవల ఆ వ్యక్తి తన అత్తింటికి వెళ్లాడు. అతడు రాగానే అత్తమామలు పలకరించలేదు. దాంతో రమేష్ కాస్త అవమానంగా భావించాడు. ఆ కారణంతో రమేష్ అత్తమామలను కోపంతో ఊగిపోయాడు. అంతేకాకుండా వారిని హత్య చేయాలని కూడా అనుకున్నాడు. ఇందులో భాగంగా రమేష్ ఈ నెల 12న అత్తమామలు ఉంటున్న ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు.

 

కానీ, ఆ సమయంలో అత్త మామలకు బదులుగా ఆ తలుపులను తల్లీకూతుళ్లు తెరిచారు. దీంతో వెంటనే కరెంట్ షాక్ తో వాళ్లు విలవిలలాడుతూ అరిచారు. వెంటనే గమనించిన స్థానికులు కరెంట్ ఆఫ్ చేసి వారిని రక్షించారు. దాంతో అనుమానం వచ్చిన రమేష్ అత్తమామలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో వారి ఇంటికి కరెంట్ షాక్ పెట్టింది ఎవరో కాదని, సొంత అల్లుడేనని తేలింది. ఆ విషయం తెలుసుకున్న అత్తమామలు అతని భార్య షాక్ అయ్యారు. పోలీసుల విచారణలో అల్లుడు రమేష్ తన అత్తమామలు ఇంటికి వెళ్ళినప్పుడు తనను పలకరించలేదు అని చెప్పడంతో ఆ కారణం విని అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -