Balayya Soundarya: బాలయ్యను సౌందర్య ఘోరంగా అవమానించిందా.. ఏం జరిగిందంటే?

Balayya Soundarya: మహానటి సావిత్రి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్ సౌందర్య. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన సౌందర్య సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన సౌందర్య బాలకృష్ణతో మాత్రం సినిమా చేయటానికి అంగీకరించలేదు.

ఇలా బాలకృష్ణ తో సినిమా చేయకపోవడంతో బాలయ్య సౌందర్యకి సరైన సమాధానం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చెన్నకేశవరెడ్డి సినిమా కోసం సౌందర్యని దర్శకనిర్మాతలు సంప్రదించారు. తండ్రి పాత్రలో నటిస్తున్న బాలకృష్ణకి జోడిగా సౌందర్యని నటించమని కోరగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలో తండ్రి, కొడుకు ఇలా రెండు పాత్రలలోనూ బాలకృష్ణ నటించాడు.

 

ఇక తల్లి పాత్రలో ఉన్న బాలకృష్ణకి జోడిగా నటించడం వల్ల తన ఇమేజ్ పడిపోతుందని సౌందర్య భావించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సౌందర్య హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది. అయితే అలా సీనియర్ బాలకృష్ణకి జోడిగా నటించడంతో తనకు అలాంటి పాత్రలే వస్తాయన్న భయంతో సౌందర్య బాలకృష్ణతో కలిసి నటించటానికి తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత పెద్ద బాలయ్యకు జోడిగా టబూ చిన్న బాలయ్యకు జోడిగా శ్రీయని పెట్టి చెన్నకేశవరెడ్డి సినిమాని విడుదల చేశారు.

 

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలా తనతో కలిసి నటించటానికి తిరస్కరించిన సౌందర్యకి ఆ సినిమా హిట్ తో బాలయ్య గట్టిగా బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో సౌందర్య తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే వివాహం జరిగిన కొంతకాలానికి విమాన ప్రమాదంలో మృత్యువాత పడింది. సౌందర్యం మరణం ఇండస్ట్రీలో తీరని లోటు మిగిల్చింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -