SriReddy: ఆ హీరోపై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

SriReddy: శ్రీరెడ్డి.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం స్టార్ట్ అయినా.. తనదైన శైలిలో కామెంట్లు చూస్తూ.. వార్తల్లో కనిపించేందుకు తెగ ప్రయత్నిస్తుంటుంది. యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసిన శ్రీరెడ్డి.. సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘నేను నాన్న అబద్ధం, జిందగీ, అరవింద్-2’ సినిమాల్లో నటించింది. అరవింద్-2తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీరెడ్డి తనదైన శైలిలో పోరాటం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో సినీ నటులు, దర్శకులు, టెక్నీషియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపణలు చేసింది.

 

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం పేరుతో శ్రీరెడ్డి బాగా ఫేమస్ అయింది. కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత.. ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీలకు తెర లేపుతూ.. వార్తల్లో నిలుస్తోంది. ప్రతిరోజూ ఎవరి మీదనో ఒకరి మీద ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే శ్రీరెడ్డికి మెగా ఫ్యామిలీ అంటే అస్సలు పడదు. నిరంతరం పవన్ కళ్యాణ్‌పై ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా మంది హీరోలపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. అయితే చాలా మంది హీరోలు ఆమెకు దూరంగానే ఉండాలని అనుకుంటారు. ఆమె ఎవరిపై ఏ బాంబు పేలుస్తుందోనని హీరోలు, దర్శకులు భయపడుతుంటారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు ఊహించని సమాధానం చెప్పింది. యాంకర్..‘మీకు ఏ హీరో అంటే ఇష్టం?’ అని అడిగారు. దానికి శ్రీరెడ్డి.. ‘నాకు హీరో మహేశ్ బాబు అంటే చాలా ఇష్టం. సిమ్లా ఆపిల్‌లా చాలా ఫ్రెష్‌గా, అందంగా ఉంటాడు. మహేశ్ బాబును చూస్తే కొరికేయాలని అనిపిస్తది.’ అంటూ దారుణంగా కామెంట్లు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో అందరూ అయిపోయారు.. ఇప్పుడు శ్రీరెడ్డి కళ్లు మహేశ్ బాబుపై పడ్డాయి. తండ్రి కోల్పోయిన బాధలో ఉన్న మహేశ్ బాబుపై ఇలాంటి కామెంట్లు చేస్తే తగదని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -