SS Rajamouli: తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టాలను ప్రపంచవ్యాప్తం చేసిన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి. తన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను చాటిన రాజమౌళి.. ఇప్పటి వరకు అపజయం ఎగురని డైరెక్టర్ గా రికార్డుకెక్కారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాజమౌళి.. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలకు డైరెక్టర్ గా మారిపోయాడు.
ప్రతి డైరెక్టర్ కి, ప్రతి యాక్టర్ కి ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంటుంది. ఏదో ఒక సబ్జెక్ట్ మీద సినిమా తీయాలని డైరెక్టర్లకు, పలానా సినిమాలోని క్యారెక్టర్ ని పోషించాలనే కోరిక యాక్టర్లకు ఉంటుంది. అయితే అలాంటి ఓ డ్రీం ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజమౌళికి కూడా ఉంది. దీని గురించి ఆయన కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు కూడా.
హాలీవుడ్ సినిమాలకు ధీటుగా మన మహాభారతాన్ని తెరకెక్కించాలనేది తన డ్రీం ప్రాజెక్ట్ అని దర్శక ధీరుడు రాజమౌళి చాలాసార్లు వెల్లడించాడు. అందుకు తగ్గట్టుగా చాలా వర్క్ కూడా చేస్తున్నట్లు రాజమౌళి తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్టే తన చివరి ప్రాజెక్ట్ అవుతుందని కూడా రాజమౌళి గతంలో ప్రకటించాడు.
అయితే తాజాాగా ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న కమర్షియల్ సినిమాల తరహాలోనే సినిమాలను కొనసాగించాలని.. మహాభారతం గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకొని.. మహాభారతం ప్రాజెక్టును తెరకెక్కించే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.