Bhadrachalam: వివాహేతర సంబంధం వల్ల అలాంటి పరిస్థితా.. ఏం జరిగిందంటే?

Bhadrachalam: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తలు విడిపోయి పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు. అంతే కాకుండా ఈ వివాహేతర సంబంధాల వల్ల భార్య, భర్తలు మద్య గొడవలు జరిగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొంతమంది హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.

అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది. వివరాలలోకి వెళితే… అరుణ అనే మహిళ తన భర్త కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ లో కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే ఈనెల 14వ తేదీ అరుణ అనారోగ్యంగా ఉందని, తన సొంత గ్రామమైన తిరువూరుకు వెళ్లి అక్కడ వైద్యులతో చికిత్స చేయించుకుంటానని భర్తకి చెప్పి ఇంటి నుండి బయలుదేరింది.

 

ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోని కప్పల బంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే అల్లుడి వరసైన యువకుడితో కలిసి భద్రాచలానికి వెళ్లి అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి ఒక రోజంతా రూంలో గడిపారు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం లాడ్జి సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా అరుణ రూంలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అరుణ మరణం గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

 

హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అరుణ కుటుంబ సభ్యులు ఆంజనేయులు ఆమెను చీరతో ఉరివేసి హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆంజనేయులు మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 302 కింద దర్యాప్తు చేపట్టారు. మరి ఈ దర్యాప్తులో భాగంగా అరుణ మరణానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -