Sudigali Sudheer: సుధీర్ ని అవమానించడానికే మల్లెమాల అలా చేసిందా?

Sudigali Sudheer: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుడిగాలి సుధీర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లికర ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్.. ప్రస్తుతం బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు. జబర్దస్త్ ద్వారా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను ఎంతో బాగా మెప్పించేవాడు.

నిజానికి సుధీర్ ని మల్టీ టాలెంటెడ్ గాయ్ అని అనవచ్చు. ఎందుకంటే ఈటీవీ జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న సుధీర్.. ప్రస్తుతం వెండి తెరపై కూడా అడుగు పెట్టాడు. సుధీర్ సిల్వర్ స్క్రీన్ వైపు వెళ్లడానికి కారణం జబర్దస్త్ అని చెప్పవచ్చు. బుల్లితెరపై వరుస ఆఫర్లు అందుకుంటూ.. ప్రస్తుతం హీరోగా హడావిడి చేస్తున్నాడు సుధీర్. ఇక ఈ కారణంగా సుధీర్ జబర్దస్త్ ను వదిలి వెళ్ళకు తప్పలేదు.

ఇక జబర్దస్త్ ను సుధీర్ వదిలి వెళ్ళడం కొంతమందికి నచ్చడం లేదు. ముఖ్యంగా మల్లెమాల టీం.. ఈటీవీలో ఉన్న వారికి చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. తనకు మంచి జీవితాన్ని అందించిన జబర్దస్త్ షో, ఈటీవీ డ్రామా కంపెనీ షో ను వదిలి వెళ్ళినందుకు వాళ్లు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆ కోపాన్ని చూపించే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తుంది.

ఇంతకు ఏం చేశారంటే.. ఇటీవలే ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా సుడిగాలి సుధీర్ హాజరయ్యాడు. అలా సుడిగాలి సుధీర్ రావడాన్ని చూసి తన అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు కూడా. ఇక ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ హాజరైన సమయంలో తనను కొంతమంది అవమానించారంటూ వార్తలు సాగుతున్నాయి.

సుధీర్ కి తగినంత మర్యాద ఇవ్వకుండా తనను అవమానించారన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సుధీర్ కనపడకుండా స్కిట్ ను ఎడిట్ చేసి.. మరింత అవమానపరిచినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం తెలిసిన సుడిగాలి సుధీర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఏదేమైనా సుధీర్ మాత్రం వెండి తెరపై హీరోగా హడావిడి చేస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -