Sudigali Sudheer: సుధీర్ ఏ ఛానల్ లో కనిపించక పోవడానికి ఇదే కారణమా?

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన సుధీర్ అనంతరం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున సందడి చేశారు. అయితే ప్రస్తుతం మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు సుధీర్ దూరంగా ఉన్నారు.

ఇలా ఈటీవీ నుంచి దూరమైన సుధీర్ స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి అనసూయతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు.అయితే సుధీర్ ఇలా ఏ ఛానల్ లోనూ కనిపించకపోవడానికి కారణం గురించి ఓ వార్త వైరల్ గా మారింది.

సుడిగాలి సుధీర్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారని అందుకే ఆయన బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలలోనూ కనిపించడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే ఆయన ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారనే విషయం తెలియకపోయినప్పటికీ ఈ విషయం గురించి జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి సుదీర్ సన్నిహితులు ఎక్కడ ప్రస్తావించింది లేదు.

ఇలా సుధీర్ వింత వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మరికొందరు వీటిని పూర్తిగా ఖండిస్తున్నారు. సుధీర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని,ఒకవేళ అలాంటి పరిస్థితులలో సుదీర్ ఉంటే ఇప్పటికే తన సన్నిహితులు ద్వారా ఈ విషయం తెలిసిపోయేది అంటూ మరికొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.అయితే సుధీర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై సుదీర్ స్పందించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -