Surekha Vani: కన్నీళ్లు పెట్టిస్తున్న సురేఖావాణి ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?

Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. సురేష్ తేజ మరణించిన తర్వాత ఈమె సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయితే సినిమా అవకాశాలు రాక దూరంగా ఉన్నారా లేక కావాలని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా అనే విషయం తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సురేఖ వాణి సినిమాలను బాగా తగ్గించిందని చెప్పాలి.

ఇక కరోనా ముందు తన భర్త చనిపోవడంతో కరోనా సమయంలో తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తన కుమార్తెతో కలిసి సురేఖ వాణి చేసే హంగామాములుగా ఉండదు. తరచు పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇక వీరికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇలా వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సురేఖ వాణి పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తె సుప్రీత తన తల్లికి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ క్రమంలోనే తన బర్త్డేకి సంబంధించిన ఫోటోలు వీడియోలను సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సురేఖవాణి తన భర్తను తలచుకొని నా కళ్ళల్లో ఆనందం ఉన్న నువ్వు లేవనే బాధ చాలా ఉంది. నువ్వు లేకపోయినా నీ ప్రేమ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయని నాకు తెలుసు. నువ్వు ప్రతిసారి నా బర్త్ డే కి చేసిన హడావిడి నాకు ఇప్పటికీ గుర్తుంది. మిస్ యు సో మచ్…లవ్ యు ఫర్ ఎవర్ అంటూ సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా తన భర్తను తలుచుకుంటూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -