Tamanna: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. అయిపోయిందంటూ?

Tamanna: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఓ వైపు భారీ బడ్జెట్‌తో స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే.. మరోవైపు చిన్న హీరోలతో కూడా జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. వాస్తవానికి స్టార్ హీరోయిన్లు చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు రారు. కానీ తమన్నా వీటికి భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఏ సినిమా చేసినా.. ఎంత సంపాదిస్తున్నామనే పాయింట్ ఆఫ్ వ్యూవ్‌తోనే ఆలోచిస్తారు. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. అలాగే మేఘా ఆకాశ్, కావ్య శెట్టి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కన్నడ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా తమన్నా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది.

 

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు కొత్తేం కాదు. ఇప్పటివరకు నేను చాలా రీమేక్ సినిమాల్లో నటించాను. సినిమా ఒరిజినాలిటీని మిస్ కానివ్వకుండా ఛాలెజింగ్‌గా తీసుకుని చేస్తాను. ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, నా పాత్ర బోర్ కొట్టకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే లవ్ స్టోరీస్‌తో ఉండే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం కష్టమైన పనే. కానీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటితడి తెప్పించేలా ఉంటాయి. సేమ్ స్టోరీతో చాలా సినిమాలు ఉంటాయి. కానీ ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుంది.’ అని చెప్పుకొచ్చారు.

‘ఈ మధ్యకాలంలో నా పెళ్లి గురించి చాలానే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటికే నాకు రెండు సార్లు పెళ్లి జరిగినట్లు పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌తో, మరోసారి వ్యాపారవేత్తతో పెళ్లి అయినట్లు చెప్పారు. కానీ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నిజంగా నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కచ్చితంగా అందరికీ చెప్పి చేసుకుంటాను. పెళ్లి విషయంలో దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంట్లో కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రస్తుతం నాపై ఉంది. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. పెళ్లి విషయం ఉంటే నేనే మీకు చెప్తాను.’ అని తమన్నా తన పెళ్లిపై అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -