Tammareddy Bharadwaja: పీకే పొలిటికల్ జర్నీపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Tammareddy Bharadwaja: టాలీవుడ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నిత్యం పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. ఇప్పటికే తారా స్థాయిలో ఏపీ రాజకీయాలు నడుస్తుండగా, తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


ఏపీలో రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు సీట్లు రాకపోయినా, ఓటింగ్ ఫర్సెంట్ బాగానే సంపాదించారు. ఈ సారి దాన్ని మరింత పెంచుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ తో పొత్తు సై అంటున్నారు. అవసరం అయితే బీజేపీతో తెంచుకునేందుకు కూడా పవన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా గత సభల్లో పవన్ క్యాడర్ కు స్పష్టంగా చేశారు.

 

ఇక తమ పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జనసైనికులు కూడా సిద్ధం అయ్యారు. వైసీపీ విముక్త ఏపీ కోసం కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కావాల్సింది కింగ్ కానీ, కింగ్ మేకర్ కాదని అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఏదో నాలుగైదు సీట్లు తెచ్చుకుని.. బ్లాక్ మెయిల్ చేసి సీఎం అయిపోదాం అనుకుంటే కుదరని పని అని చెప్పిన తమ్మారెడ్డి, పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి రాజకీయాలు అస్సలు సూట్ కావని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తనకు ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పడం బాధించిందని ఆయన అన్నారు.

 

పవన్ గత ఎన్నికల్లో గెలుపు కోసం కనీసం ప్రయత్నించలేదంటూ సంచలన వ్యాఖ్యలు కూడా తమ్మారెడ్డి చేసేశారు.
జనసేనకు బలం ఉన్న మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదని అన్నారు. రాజకీయాల్లో కావాల్సింది కింగ్ మేకర్ కావడం కాదని, కింగ్ అవ్వాలి అని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -