Taraka Ratna: నందమూరి అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్న మూమెంట్ ఇదే!

Taraka Ratna: నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. 23 రోజులపాటు మృతువుతో పోరాడే ఇటీవలే మహాశివరాత్రి పండుగ రోజు మరణించారు. అయితే హాస్పిటల్ నుంచి నవ్వుతూ తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఉహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అలేఖ్య రెడ్డి తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతోంది.

ఈ నేపథ్యంలోనే అలేఖ్య రెడ్డి తన భర్తతో కలిసి ఆఖరిసారిగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే నందమూరి తారకరత్న చనిపోవడానికి కొద్ది రోజులు ముందే తన ఫ్యామిలీ పిల్లలు అందరితో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ సమయంలోనే తన కూతురు భార్య కొడుకుని మీడియాకు పరిచయం చేశాడు తారకరత్న. తిరుమల కి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారకరత్న అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి తన భర్తతో ఉన్న స్వీట్ మెమోరీస్ మరోసారి గుర్తు చేసుకుంది.

 

ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా హృదయం ముక్కలు అయిపోతుంది. ఇదంతా కల అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది.. నీ వాయిస్ తో అమ్మ బంగారు అంటూ లేపవా ఎంతో బాధగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ని చూసిన నందమూరి అభిమానులు అలేఖ్య రెడ్డికి ధైర్యం చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -