Naga Chaitanya-Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నాగచైతన్య సమంత జంట ఒకటి. నాగచైతన్య సమంత పలు సినిమాలలో నటిస్తూ ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమించుకున్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదు. పెళ్లి చేసుకున్నటువంటి మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోయారు.
విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్య వీరిద్దరు కూడా వారి వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే నాగచైతన్య ఒక టాలీవుడ్ హీరోతో ఎంతో క్లోజ్ గా ఉండేవారట ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులు అయ్యారు. సమంత కారణం చేత వీరిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడిందని తెలుస్తుంది. మరి నాగచైతన్యత ఎవరు అంత క్లోజ్ గా ఉన్నారు ఎందుకు శత్రుత్వం ఏర్పడిందనే విషయాన్ని వస్తే…
అంతకు మొదట్లో తెలుగు రాకపోవడంతో ఈమె సినిమాలన్నింటికీ సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేది. సమంత చిన్మయి ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు అయితే చిన్మయి నటుడు రాహుల్ రవీందర్ ను పెళ్లి చేసుకున్నారు. రాహుల్ రవీందర్ నాగచైతన్య ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక్కడ రాహుల్ రవీందర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా మన్మధుడు 2 చేశారు. ఇలా వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.
సమంత ఎప్పుడైతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చారు ఆ క్షణం నుంచి చిన్మయి రవీందర్ సమంత వైపు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేశారు. దీంతో నాగ చైతన్య రాహుల్ రవీంద్ర మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. సమంత విడాకులు తీసుకోవడం వల్లే రాహుల్ రవీంద్ర నాగచైతన్య మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కట్ అయిందని వీరిద్దరూ ఇప్పుడు శత్రువులుగా మారిపోయారని చెప్పాలి. ఇక రాహుల్ రవీంద్రనాథ్ చైతన్యతో మాట్లాడకపోవడమే కాకుండా నాగచైతన్య పట్ల నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.