Rajasthan: ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఘోరాలను చూస్తే ఈ సమాజంలో ఇంత దారుణమైన ఘోరమైన మనుషులు ఉన్నారా అన్న అనుమానాలు రాకమానదు. చాలామంది క్రూరమైన మృగాళ్ళు ఆడది బయట కనిపించింది అంటే చాలు చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై అత్యాచారాలు ఒడిగడుతున్నారు. కన్న కూతుర్ని సొంత చెల్లెల్ని కన్నతల్లిని ఇలా ఒక్కరిని విడిచిపెట్టడం లేదు కామాంధులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దారుణమైన ఘటన భయభ్రాంతులకు లోను చేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, సికార్ జిల్లా పరిధిలోని అజిత్గఢ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తాజాగా రోడ్డు ప్రమాదం కారణంగా మరణించడంతో పోస్టుమార్టం అనంతరం పోలీసులు సదరు మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆపై కుటుంబ సభ్యులు తాజాగా ఆ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తరువాత అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. అయితే అదే రోజు రాత్రి ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తాంత్రిక పూజల పేరుతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇంతటితో ఆగని ఆ దుర్మార్గులు కామాంధులు ఆపై అవమానవీయంగా మృతదేహం పై అత్యాచారానికి పాల్పడ్డారు. బతికున్న మహిళలనే కాకుండా పూడ్చిపెట్టిన శవాలను కూడా విడిచిపెట్టలేదు ఆ కామాంధులు. అయితే అర్థరాత్రి సమయంలో శ్మశానంలో అలికిడి వస్తుండడంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా వారి బాగోతం బయటపడింది. వెంటనే పెద్ద పెద్ద అరుపులతో గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో అందరూ కలిసి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లు తాంత్రిక పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు స్థానిక ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అని చెప్తున్నారు. తాగిన మత్తులో ఇలా ప్రవర్తించారా? లేదా శరీర భాగాలను ఛిద్రం చేయాలన్న ఆలోచన ఉందా? అన్న దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.