Hero Serious: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం జూన్ 9న జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు వీరి ప్రేమ గురించి అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నప్పటికీ వారిద్దరూ ఎక్కడా ఈ విషయం గురించి ప్రస్తావించకుండా ఒకేసారి నిశ్చితార్థం గురించి ప్రకటించేసరికి అందరూ షాక్ అయ్యారు.
అసలు గత ఏడాదిలోనే వీరి నిశ్చితార్థం, పెళ్లి జరిగి ఉండవలసింది కానీ నిహారిక లైఫ్ సెట్టింగ్ అయిన తర్వాత చేసుకుందాం అని లావణ్య అనడంతో పెళ్లి చేసుకొని అయినట్లు సమాచారం. అయితే నిహారిక వ్యవహార ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించకపోవడంతో ఒక అడుగు ముందుకు వేసి ఈ జూన్ లో నిశ్చితార్థం పెట్టుకున్నారు ఈ జంట.
పెళ్లి కూడా ఈ సంవత్సరం ఆఖరిలో ఉండవచ్చు అని సినీ వర్గాల సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ పెళ్లి ఇంట్లో అందరికీ ఇష్టమైనప్పటికీ ఒక మెగా హీరోకి ఇష్టం లేదట ఆయన మరెవరో కాదు అల్లు శిరీష్. వీరిద్దరూ కలిసి గతంలో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఆ సమయంలోనే శిరీష్ లావణ్య పై మనసు పారేసుకున్నాడని.. అప్పటికే వరుణ్ ప్రేమలో ఉన్న లావణ్య, శిరీష్ ని దూరం పెడుతూ వచ్చిందని సమాచారం. ఆ సమయంలో లావణ్య పై శిరీష్ సీరియస్ అయినట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే మొన్న జరిగిన నిశ్చితార్థం లో ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నప్పటికీ అల్లు శిరీష్ మాత్రం ఆ వేడుకలకి హాజరు కాకుండా తన నిరసన తెలియజేశారు.
ఈ వేడుకలలో శిరీష్ అన్న వదిన అయినటువంటి అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మాత్రం ఎప్పటిలాగే తమ స్టైలిష్ లుక్ తో సందడి చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని లావణ్య వరుణ్ ల జంట మాత్రం ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.