Nara Lokesh: తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా గత రాత్రి తాడేపల్లిలో జెండా సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. జనసేన టిడిపి కలిసి ఈ జండా సభను ఎంతో విజయవంతం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అధికార పక్షం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే
ఇక ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నేతలు అలాగే తెలుగుదేశం పార్టీ కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి నారా లోకేష్ మాత్రం దూరంగా ఉన్నారు. ఈ విధంగా నారా లోకేష్ దూరంగా ఉండడంతో వైసిపి సోషల్ మీడియా బ్యాచ్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రచారం చేస్తుంది. చంద్రబాబు నాయుడుతో పాటు సమానంగా పవన్ కళ్యాణ్ వేదిక పంచుకోవడం లోకేష్ కు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే లోకేష్ అలిగారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ ఈ కార్యక్రమానికి రాకూడదని తను మాత్రమే చంద్రబాబు నాయుడుతో కలిసి వేదిక పంచుకోవాలని చంద్రబాబు వద్ద డిమాండ్ చేశారు అంటూ కూడా కథలు అల్లుతున్నారు కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్లాన్ చేయడంతో నారా లోకేష్ దూరంగా ఉన్నరు. ఇక యువగలం పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లోకేష్ కి సంబంధించినది కావడంతో ఈ పూర్తి బాధ్యత తనకే అప్ప చెప్పారని ఇప్పుడు కూడా ఈ జెండా కార్యక్రమం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సంబంధించినది కావడంతో లోకేష్ దూరంగా ఉన్నారు.