Samantha: అక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తున్న సమంత.. ఎందుకంటే?

Samantha: సమంత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతుంది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకొని కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. అటు హాలీవుడ్ లో కూడా ఈ భామ సినీ అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సమంత విడాకుల తర్వాత కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది.

విడాకులు అయిన తర్వాత సమంత అనేక రకాల పుకార్లను సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొంది. కానీ ఈ పుకార్లను సమంత ఏమాత్రం పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయింది. ఇక సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మరి ఇదే క్రమంలో సమంత తన హాట్ ఫోటోలను కూడా నెట్టింట్లో పంచుకుంటుంది.

ఇక ఇటీవలే సమంత గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. అదేమిటంటే సమంతకు స్కిన్ డేసిస్ వచ్చిందని, దాని కారణంగా బయటకు రావట్లేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమంత తను చేయబోయే షూటింగ్ లు కూడా వదులుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పుకార్ల గురించి సమంత పర్సనల్ మేనేజర్ అలాంటిదేమీ లేదని కొట్టి పారేశాడు. ఇక తాజాగా సమంత ఒక వేద పాఠశాలలో ప్రత్యేక పూజలు చేస్తుంది.

సికింద్రాబాద్లో ఒక వేద పాఠశాలకు వెళ్లింది. అక్కడ ప్రత్యేక పూజలు చేయించిందట. అసలు సమంత వేద పాఠశాలలో పూజలు ఎందుకు చేస్తుంది. అసలు దీనికి గల కారణమేమిటి అని సోషల్ మీడియాలో చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం సమంత చేసిన పూజలు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తున్నాయి. అక్కడ వేదమంత్రాలను అభ్యసిస్తున్న చిన్నారులతో కలిసి సమంత ఫోటోలో కనిపిస్తుంది. మరి మీరు కూడా ఆ ఫోటోల వైపు ఒక లుక్కేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -