Guntur Kaaram: గుంటూరు కారం రెండో రోజు కలెక్షన్ల లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే!

Guntur Kaaram: టాలీవుడ్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రికార్డుల మోత మోగిస్తుంది అనుకున్న ఈ సినిమా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మ్యాగ్జిమమ్ ఎన్ని వీలైతే అన్ని స్క్రీన్స్ ఈ మూవీకి ఇచ్చేశారు.

 

హనుమాన్ సినిమా వేయాల్సిన థియేటర్లలో కూడా గుంటూరు కారం వేశారు. అలా మొదటి రోజు భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు దారుణంగా పడిపోయింది. దీంతో మొదటి రోజు ప్రేక్షకులు అభిమానులతో కిక్కిరిసిపోయిన థియేటర్లు రెండవ రోజు వెలవెల బోయాయి. కాగా గుంటూరుకారం సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు. తాజాగా 2 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు 2 రోజుల్లో రూ. 127 కోట్లు గ్రాస్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. అంటే, ఈ సినిమాకు రెండో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.33 కోట్లు మాత్రమే వచ్చాయన్నమాట.

మొదటి రోజు వసూళ్లతో పోల్చి చూస్తే, మూడో వంతుకు వసూళ్లు పడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గుంటూరుకారం సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం ఒక కారణమైతే ఆ సినిమా తర్వాత వచ్చిన సైంధవ్ తో థియేటర్లు షేర్ చేసుకోవడం మరో కారణం. అందుకే వసూళ్లలో భారీ తగ్గుదల కనిపించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను బట్టి చూస్తుంటే మహేష్ బాబు పరువు మొత్తం గంగలో కలిసిపోయిందని అంటున్నారు ప్రేక్షకులు. గుంటూరుకారం సినిమాకు మూడు, నాలుగవ రోజు వసూళ్లు మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -